గంగారం గ్రామంలో ప్రజలకు హెల్త్ క్యాంపు
కాటారం, డిసెంబర్9,తెలంగాణజ్యోతి: మండలంలోని గంగారం గ్రామం లో మంగళవారం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పరిధిలో ఐ ఈ సి, ఐ హెచ్ సి క్యాంపు నిర్వహించారు. ప్రజలకు సాంక్రమిక వ్యాధులు సంక్ర మించకుండా ఆ వ్యాధుల పట్ల తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో హెచ్ పి సుమన్, ఎం పి హెచ్ ఎ ఎఫ్ మనోరమ, రజని, ఆశా కార్యకర్తలు స్వరూప, కాంత పాల్గొన్నారు.






