రాష్ట్రస్థాయి కబడ్డీకి గోగు శేషు ఎంపిక
మంత్రి సీతక్క చేతుల మీదుగా సన్మానం
ములుగు, డిసెంబర్ 16, తెలంగాణ జ్యోతి : వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేట గ్రామానికి చెందిన గోగు శేషు రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు. మంగళవారం ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి దనసరి సీతక్క శేషును శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ములుగు జిల్లా పేరును జాతీయ స్థాయిలో నిలబెట్టేలా క్రీడాకారులు కృషి చేయాలని, వారికి అవసరమైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ నెల 25 నుంచి 27 వరకు కరీంనగర్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో శేషు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ పైడాకుల అశోక్, అధ్యక్షుడు భూక్య రవీందర్, కార్యదర్శి పోలేపోక జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.






