మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం

మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం

తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం :  మండలంలోని శివా పురం గ్రామపంచాయతీ పరిధిలో ఇటీవల మృతి చెందిన మాజీ సర్పంచ్ యాలం రాంబాబు కుటుంబ సభ్యులనుబి ఆర్ ఎస్ శ్రేణులు పరామర్శించారు. ములుగు జిల్లా అధ్యక్షు లు కాకులమర్రి లక్ష్మణ్ బాబు, ప్రదీప్ ల పిలుపుమేరకు ఏటూరునాగారం మండల కమిటీ అధ్యక్షుడు గడదాసు సునీల్ కుమార్ ఆధ్వర్యంలో  తక్షణ సహాయం కింద 21 వేల నగదు, ఒక కింట బియ్యాన్ని యాలం రాంబాబు కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం బి ఆర్ ఎస్ శ్రేణులు తాండూరి రఘు, కిరణ్, బోజారావు, ఖలీ ల్, కాకులమర్రి భాస్కర్, శివాపురం గ్రామ కమిటీ అధ్యక్షుడు మహేష్, బి ఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment