ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
– ఎస్సై రాజ్కుమార్
ఏటూరునాగారం, జూన్ 14, తెలంగాణ జ్యోతి : ఏటూరు నాగారం పోలీస్ స్టేషన్కు నూతన ఎస్సైగా రాజ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. త్రిపుల్ రైడింగ్ చేయరాదని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం తీవ్ర నేరమని హెచ్చరిస్తూ, వాహనాలకు సంబంధించి ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు లాంటి ధ్రువపత్రాలు తప్పకుండా వెంట పెట్టుకోవాలన్నారు. వాహనాలపై నెంబర్ ప్లేట్లు ఉండటం తప్పనిసరి అని స్పష్టం చేశారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారి వాహనాలను సీజ్ చేసి, జరిమానాలు విధించేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. ప్రజల సహకారంతో ట్రాఫిక్ శాంతిభద్రతలు మెరుగుపరచడమే లక్ష్యంగా పనిచేస్తామని ఎస్సై రాజ్ కుమార్ తెలిపారు.