ఎన్నికల ఖర్చులు కట్టుదిట్టగా నమోదు చేయాలి

ఎన్నికల ఖర్చులు కట్టుదిట్టగా నమోదు చేయాలి

  • జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా
  • అసెంబ్లీ నియోజకవర్గంలో అభ్యర్థి ఎన్నికల వ్యయ పరిమితి 40 లక్షలు
  • ఎన్నికలలో డబ్బు, మధ్యం పంపిణీ పై డేగ కన్ను తో పరిశీలించాలి
  • ఎన్నికల వ్యయ పరిశీలన పై అకౌంటింగ్ బృందాలతో రివ్యూ నిర్వహించిన జిల్లా కలెక్టర్

తెలంగాణ జ్యోతి ,భూపాలపల్లి ప్రతినిధి: రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో ప్రతి అభ్యర్థి ఎన్నికల వివరాలను భారత ఎన్నికల కమిషన్ సూచించిన మార్గదర్శకాల ప్రకారం కట్టుదిట్టంగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ , ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా అన్నారు. గురువారం ప్రగతి భవన్ లో జిల్లా ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా, రాబోయే అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఖర్చుల నమోదు పై అకౌంటింగ్ బృందాలతో రివ్యూ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ , ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ ఎన్నికల సమయంలో అభ్యర్థుల ఎన్నికల ఖర్చుల వివరాలను నిబంధనల ప్రకారం కట్టుదిట్టంగా నమోదు చేయాలని, పారదర్శకంగా ప్రతి అభ్యర్థికి సమాన హక్కులు కల్పిస్తూ ఎన్నికలను నిర్వహించాలని అన్నారు. భారత ఎన్నికల కమిషన్ తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గానికి అభ్యర్థి ఎన్నికల ఖర్చు వేయడం గరిష్ట పరిమితి 40 లక్షలుగా నిర్ధారించిందని కలెక్టర్ తెలిపారు. రాబోయే రోజులలో జిల్లాలో జరిగే రాజకీయ పార్టీల సమావేశాలు సభలు ,ఫ్లెక్సీలు, బ్యానర్లు, కరపత్రాలు పంపిణీ , వీఐపీలు పాల్గొనే బహిరంగ సభలు వాటికి అయ్యే వివరాలను నిషితంగా పరిశీలించి ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మేరకు అభ్యర్థి ఖాతాలో నమోదు చేయాలని అన్నారు. నామినేషన్ వేసినప్పటినుంచి అభ్యర్థి ఎన్నికల కోసం చేసే ఖర్చులకు ప్రత్యేకమైన బ్యాంకు ఖాతా ప్రారంభించాల్సి ఉంటుందని, అందులో నుంచి మాత్రమే ఎన్నికల ఖర్చులు చేయాలని, వీటిని పరిశీలించేందుకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, ఎన్నికల వ్యయ పరిశీలకులు, వీడియో సర్వేలెన్సు బృందాలు వీడియో వ్యూంగ్ బృందాలు, అకౌంటింగ్ బృందాలు, మానిటరింగ్ సెల్ కాల్ సెంటర్, స్టాటిక్ సర్వ లైన్స్ బృందాలు ,వ్యయ మానిటరింగ్ సెల్ మొదలకు బృందాలు వారికి కేటాయించిన విధులను పకడ్బందీగా నిష్పక్షపాతంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో ఇక పై ప్రింటింగ్ ప్రెస్ యజమానులు ఎన్నికల కరపత్రాలు ఫ్లెక్సీలు బ్యానర్లు ముద్రించే సమయంలో తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలని, ఎన్నికల ఫ్లెక్సీల పై ఎవరు ముద్రిస్తున్నారో వారి ఫోన్ నెంబర్ తప్పనిసరిగా ప్రింట్ చేయాలని అన్నారు. ఎన్నికల సమయంలో డబ్బు మద్యం ప్రభావం ఉండకుండా నిరంతరం నిఘా ఉండాలని, అభ్యర్థులు ఎన్నికల ఖర్చుపై అధికారులు డేగ కన్నుతో పరిశీలించాలని అన్నారు. ప్రజా ప్రాతినిధ్య 1951 ప్రకారం ఎన్నికల ప్రవర్తన నియమాలను ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, ఆడిట్ ఆఫీసర్ శ్రవణ్ , డి.పి.అర్.ఓ వి. శ్రీధర్, డి.పి. ఓ . ఆశా లత, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు .

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “ఎన్నికల ఖర్చులు కట్టుదిట్టగా నమోదు చేయాలి”

Leave a comment