ఆస్తులు కూడబెట్టడం కన్నా దానగుణం గొప్పది

ఆస్తులు కూడబెట్టడం కన్నా దానగుణం గొప్పది

ఆస్తులు కూడబెట్టడం కన్నా దానగుణం గొప్పది

– విద్యార్థులు పట్టుదలతో ఉన్నత కొలువులు సాధించాలి

– రాష్ట్ర మంత్రి సీతక్క

– మలబార్ సొసైటీ ఆధ్వర్యంలో 340 మంది పేద బాలికలకు స్కాలర్ షిప్స్ పంపిణీ

ములుగు ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : కష్టపడి తరతరాల కోసం ఆస్తులు కూడబెట్టడంతో పాటు దాన గుణంతో పేదలకు సాయం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ (సీతక్క) పిలుపునిచ్చారు. విద్యార్థులు కష్టపడి చదువుతూ ఉన్నత కొలువుల్లో రాణించాలని సూచించారు. ఆదివారం ములుగు డీఎల్ ఆర్ ఫంక్షన్ హాల్ లో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 340మంది బాలికలకు రూ.10వేల చొప్పున స్కాలర్ షిప్స్ అందించగా మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బాలికలు, మహిళల సాధికారత కోసం, పేద బిడ్డల అభ్యున్నతి కోసం 340మంది బాలికలకు స్కాలర్షిప్స్ అందించడం హర్షణీయమన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 116కళాశాలల్లో చదువుతున్న 3,900 మంది బాలికల విద్యకు మద్దతుగా ఉపకార వేతనాలు అందించడం గొప్ప విషయం అన్నారు. రూ.3.14కోట్లు బాలికల చదువుకు కేటాయించడం సంతోషకరమని పేర్కొన్నారు. మలబార్ గోల్డ్ & డైమండ్స్ జోనల్ హెడ్ శ్రీ షానిబ్.కె, రాకేష్ రెడ్డి, మలబార్ గ్రూప్ చైర్మన్ ఎం.పి.అహమ్మద్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా 21,000 మంది బాలికల విద్యకు మద్దతుగా రూ.16కోట్లను కేటాయించామన్నారు. ప్రపంచాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన సాధనం విద్య అని, విద్యావకాశాలను విస్తృతం చేయడం, జీవితాలను మార్చడం మలబార్ గ్రూప్ బలమైన నమ్మకానికి నిదర్శనం అన్నారు. సమాజంలో యువతులకు ఉన్న అడ్డంకులను తొలగించడానికి కట్టుబడి ఉన్నామన్నారు. మలబార్ గ్రూపు లాభాలలో 5శాతం విద్య ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, పేదరిక నిర్మూలన వంటి సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మలబార్ గోల్డ్, డైమండ్స్ వరంగల్ షోరూం హెడ్ అజీశ్ అహ్మద్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవి చందర్, తదితరులు పాల్గొన్నారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment