మౌని అమావాస్య సందర్భంగా కాళేశ్వరంలో పోటెత్తిన భక్తులు

మౌని అమావాస్య సందర్భంగా కాళేశ్వరంలో పోటెత్తిన భక్తులు

– త్రివేణి సంగమం వద్ద స్నానాల కోసం భారీగా భక్తులు..

కాళేశ్వరం, తెలంగాణజ్యోతి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో మౌని అమా వాస్యను పురస్కరించుకొని త్రివేణి సంగమం వద్ద స్నానాలు ఆచరించేందుకు ఉదయం 4 గంటల నుండే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం స్వామి వారి గర్భగుడిలో అభిషేక పూజలు నిర్వహించారు. దీంతో ఆలయ పరిసరాలు గోదావరి తీరంలో భక్తుల కోలా హలం నెలకొంది. మహారాష్ట్ర, చతిస్గడ్ నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో క్యూ లైన్ లో భక్తులు కిక్కిరిశారు .భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు దేవస్థానం ఈవో మహేష్ పర్యవేక్షకులు బుర్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఆలయ పరిసరాలు, గోదావరి తీరం వద్ద వాహనాలు పార్కింగ్ వద్ద భక్తులకు ఎలాంటి అంతరాయం కలగకుండా కాళేశ్వరం ఎస్సై తమాషా రెడ్డి తమ సిబ్బందితో పర్యవేక్షించారు.

[metaslider id="19893"]

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment