కాళేశ్వరాలయానికి పోటెత్తిన భక్తులు.

కాళేశ్వరాలయానికి పోటెత్తిన భక్తులు.

– శని త్రయోదశి సందర్భంగా భక్తుల రద్దీ.

కాళేశ్వరం, తెలంగాణ జ్యోతి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో శని త్రయోదశి సందర్భంగా అనుబంధ దేవాలయం శ్రీ సుబ్రహ్మణ్యస్వామి, నవగ్రహాల వద్ద శనివారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు గోదావరి లో పుణ్య స్నానాలు ఆచరించి కాలసర్ప, శని నివారణ పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి గర్భగుడిలో అభిషేక పూజలు నిర్వహించారు. దీంతో ఆలయ పరిసరాలు గోదావరి తీరంలో భక్తుల కోలాహలం నెలకొంది. అలాగే పదహారో పండుగ సందర్భంగా శ్రీ శుభానంద ముక్తిశ్వర కళ్యాణ మహోత్సవం నిర్వహించారు.ఈకార్యక్రమంలో ఆలయఅర్చకులు, సిబ్బంది, భక్తులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మహాదేవపూర్ మండల ప్రతినిధి/ఆరవెల్లి సంపత్ కుమార్.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment