ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ పంపిణి

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ పంపిణి

తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి : స్వయంకృషి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కాటారంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో కేక్ కట్ చేయించి విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో స్వయంకృషి స్వచ్ఛంద సంస్థ సభ్యులు కొట్టే సతీష్, కడారి విక్రమ్, ఆదిత్య రావు, పున్నం సతీష్, పవన్, బన్నీ, బబ్బులు , సుమన్, హైమద్, సిఆర్పిఎఫ్ జవాన్ మనోహర్, పాఠశాల ఉపాధ్యాయులు రవీందర్, నరసయ్య, రాములు, గీత స్వచ్ఛంద సంస్థ యువకులు పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా స్వచ్ఛంద సంస్థ సభ్యులు మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకలను చదువుకునే విద్యార్థుల సమక్షంలో జరుపు కోవాలని వారిని ప్రోత్సహించే కార్యక్రమాలను చేపట్టాలని అందుకు ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడిన యువతీ యువకులు ముందుకు రావాలని కోరారు.ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన స్వయంకృషి స్వచ్ఛంద సంస్థ సభ్యులను పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ పంపిణి”

Leave a comment