ఆదివాసి సమస్యల పరిష్కారానికై మే5న కలెక్టరేట్ ముట్టడి

ఆదివాసి సమస్యల పరిష్కారానికై మే5న కలెక్టరేట్ ముట్టడి

ఆదివాసి సమస్యల పరిష్కారానికై మే5న కలెక్టరేట్ ముట్టడి

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు(మం) పేరూరు గ్రామం లో శుక్రవారం ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆదివాసి చట్టాలు, సమస్యల పరిష్కారానికై  మే5న ములుగు జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం జయప్రదం చేయాలని ములుగు జిల్లా కన్వీనర్ పర్శిక సతీష్ పిలుపునిచ్చారు. ఏఎస్పీ ఏటూరునాగా రం డివిజన్ అధ్యక్షులు టింగా బుచ్చయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా కన్వీనర్ పర్శిక సతీష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసి చట్టాలను కాపాడతామని, చెబుతూనే ఏజెన్సీ ప్రాంతాల్లో గిరినేతరులకు హక్కులు కల్పించ డానికి కుట్ర చేస్తుంtదని మండిపడ్డారు. 5వ షెడ్యూల్డ్ ప్రాంతంలో జీ.ఓ.యంఎస్.నెం.3ను మినీ అసెంబ్లీ అయినట్టు వంటి ట్రైబల్ అడ్వైయిజరి కమిటీలో మరియు అసెంబ్లీ లో తీర్మానం చేసి చట్టంగా మార్చాలని,ఏజెన్సీ ప్రాంతంలో పీసా గ్రామ సభ ద్వారానే ఇందిరమ్మ ఇల్లు ఎంపిక జరగాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో 1/70 పీసా, పార్లమెంట్ చట్టాలను పగడ్బం దీగా అమలు చేయాలని, 1970 సంవత్సరం తర్వాత ఏజెన్సీ ప్రాంతంలోనికి వచ్చిన గిరిజనేతరులను, మైదాన ప్రాంతానికి తరలించాలని,చట్టబద్ధత లేని లంబాడీలను ఎస్టీ జాబితాలో నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన ఇసుక సొసైటీలకు ఈకో సెన్సిటిల్ జోన్ల ను సుప్రీంకోర్టు తీర్పు అనుగుణంగా సడలింపు ఇవ్వాలని, గిరిజన ఇసుక సొసైటీలకు బిల్లులు సకాలంలో చెల్లించాని కోరారు. ఏజెన్సీ ప్రాంతంలో స్పెషల్ డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని, ఇంకా అనేక డిమాండ్స్ తో 5 మే 2025న సోమవారం నాడు ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ములుగు జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని ఆదివాసి ప్రజలు యువతీ, యువకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ ఏటూరు నాగారం డివిజన్ అధ్యక్షులు టింగా బుచ్చయ్య, వాజేడు మండల అధ్యక్షులు లోడిగ నరసింహారావు, కుర్సం సుధాకర్, నరసింహా రావు, తొర్రం మనోజ్, వెంకటాపురం మండల అధ్యక్షులు తుర్స క్రిష్ణ బాబు, ఉపాధ్యక్షులు తాటి రాంబాబు, కెక్కెం తేజ, పూనెం అర్జున్, గోపి, వెంకటేష్, ఇర్ప మురళి, కుర్సం శంకర్, బొగ్గుల రాజ్ కుమార్, సురిటీ నవదీప్, తాటి నాగరాజు, బొగ్గుల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment