కమలాపురం పేపర్ ఫ్యాక్టరీ పై సమీక్ష నిర్వహించిన సీఎం 

కమలాపురం పేపర్ ఫ్యాక్టరీ పై సమీక్ష నిర్వహించిన సీఎం 

ములుగు, జనవరి8, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం పేపర్ ఫ్యాక్టరీ 2014లో కొన్ని కారణాలవల్ల మూతపడ్డ దానిని పునరుద్ధరణ చేయడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం హైదరాబాదులో ఉన్నత అధికారులతో కలిసి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వం ఆర్థిక కార్యకలాపాలను పెంచడానికి మరియు ఉపాధిని కల్పించడానికి ములుగు జిల్లాలో బిల్ట్ ఫ్యాక్టరీ పారిశ్రామిక యూని ట్ల పునరుద్ధరణకు ప్రాధాన్యత ఇస్తుంది. కమలాపురం లోని బిల్ట్ ఫ్యాక్టరి పునరుద్ధరణకు ఐ టి సి కి అన్ని విధాలా సహాయ సహ కారాలు అందిస్తామని సిఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ సమావేశం లో మంత్రులు అనసూయ సీతక్క , కొండా సురేఖ, పీఆర్‌ఎల్‌సీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి, పరిశ్రమల శాఖ కార్యదర్శి, సీఎంఓ అధికారులు, ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “కమలాపురం పేపర్ ఫ్యాక్టరీ పై సమీక్ష నిర్వహించిన సీఎం ”

Leave a comment