సస్పెండ్ చేయించాడనే ఆక్రోషంతో యువకుడి దారుణ హత్య
– వివరాలు వెల్లడించిన పోలీస్ కమిషనర్
హన్మకొండ, తెలంగాణ జ్యోతి : తన బంధువుతో అక్రమ సంబంధం కోనసాగిస్తున్నాడని ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసి కానిస్టేబుల్ సస్పెండ్కు కారణమైన సాయి ప్రకాశ్ అనే యువకుడుని అతి దారుణంగా హత్య చేసిన కానిస్టేబుల్తో సహ ఐదుగురిని హన్మకొండ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు వినియోగించిన ఒక కారు, రెండు ఆటోలు, రెండు ద్విచక్ర వాహనాలు, ఒక ఎయిర్ పిస్తోల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.వివరాల్లోకి వెళ్తే.. పోలీసులు అరెస్టు చేసిన వారిలో 1. ప్రస్తుతం ములుగు వెంటాపురం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ బాషబోయిన శ్రీనివాస్, చింతగట్టు, హన్మకొండ జిల్లా, 2. డేవిలీ సాయి, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్, 3. ఆలోత్ అరుణ్కుమార్ ఆలియాస్ పండు, హన్మకొండ, 4.సబావత్ అఖిల్ నాయక్, హన్మకొండ, 5. రాజు, హన్మకొండ, 6.చింతం నిర్మల, వెంకటా పురం (వాజేడు) ములుగు జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ అరెస్టు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ వివరాలను వెల్లడిస్తూ ఈ నెల 15వ తారీకున రాత్రి 11 గంటల నుండి ములుగు జిల్లా, వెంటాపురం(వాజేడు) ప్రాంతానికి చెందిన చిడెం సాయి ప్రకాశ్ (మృతుడు) హన్మకొండ అదృష్యమైనట్లుగా వచ్చిన ఫిర్యాదుపై హన్మకొండ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా అదృష్యమైన యువకుడి బంధువులు ఇచ్చిన సమచా రంతో పోలీసులు గతంలో మృతుడితో మనస్పర్థలు ఉన్న ములుగు వెంకటాపురం కానిస్టేబుల్ శ్రీనివాస్ పై అనుమానం వ్యక్తం చేస్తుండటంతో, పోలీసులకు అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకోని పోలీసులు నిందితుల్లో ఒకడైన డేవిలీ సాయిని హన్మకొండ బస్తాండ్లో అదుపులో తీసుకోని విచారించగా మిగితా నిందితులు అందరు వరంగల్ కోర్టు వెనుక భాగంలో అటోలో ఉన్నట్లుగా ఇచ్చిన సమాచారంతో మరో నలుగురు నిందితులను అరెస్టు చేశారు. మహిళా నిందితు రాలు నిర్మలను హన్మకొండ బస్టాండ్లో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా ప్రధాన నిందితుడైన కానిస్టేబుల్ శ్రీనివాస్ 2009 హైదరాబాద్లో కానిస్టేబుల్గా ఎంపికై పరస్పర బదిలీల్లో నిందితుడు హన్మకొండ కు బదిలీ అయ్యాడు. మరికొద్ది రోజులకు 317 జీ ఒ ప్రకారం మరోమారు శ్రీనివాస్ ములుగు జిల్లా వాజేడువెంకటాపురం పోలీస్ స్టేషన్ కు బదిలీ అయ్యాడు. నిందితుడు ఈ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించే సమయం లో ఇదే ప్రాంతంలో నివసించే మరో నిందితురాలు నిర్మలతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ఆక్రమ సంబంధంగా మారటంతో నిందితురాలి బంధువు వరసకు కొడుకైన మృతుడు సాయి ప్రకాశ్తో పాటు నిందితురాలి భర్త, అమె బంధువులు కానిస్టేబుల్ శ్రీనివాస్ వ్యవహరంపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో పోలీస్ అధికారులు కానిస్టేబుల్ శ్రీనివాస్ ను సస్పెండ్ చేసారు. కొద్ది కాలం అనంతరం ప్రధాన నిందితుడు శ్రీనివాస్ తిరిగి గత ఏడాది డిసెంబర్ మాసంలో విధుల్లో చేరాడు. తనపై పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసి సస్పెండ్ కారణమైన మృతుడి సాయి ప్రకాశ్పై కక్ష్య పెంచుకున్న నిందితుడు శ్రీనివాస్ తగిన సమయం కోసం ఎదురు చూసాడు. ఈ నెల 15వ తేదిన నిందితురాలు నిర్మల తన మామకు ఆరోగ్య పరీక్షల కోసం తన భర్తతో పాటు, సాయి ప్రకాశ్తో కలిసి హన్మకొండకు కారులో వచ్చినట్లుగా నిందితుడు శ్రీనివాస్కు ఫోన్ ద్వారా సమాచారం అందించింది. వెంటనే నిందితుడు శ్రీనివాస్ మిగితా నిందితులతో కల్సి అదే రోజు రాత్రి మృతుడు సాయి ప్రకాశ్ ఒంటరీగా ప్రయానిస్తున్న కారును ఆటో వెంబడిస్తూ సుమారు రాత్రి 11.30 సమయంలో నిందితులు గోపాల్పూర్ క్రాస్ రొడ్ వద్ద ఉన్న బేబి సైనిక్ స్కూల్ వద్ద నిందితులు కారు అడ్డగించి నిందితులు కారులో ఎక్కి కారును నడుపుతూ మృతుడు సాయి ప్రకాశ్ ను తీవ్రంగా కొట్టుకుంటూ హసన్పర్తి శివారు ప్రాంతంలో కారు అపి మృతుడు సాయి ప్రకాశ్ను నిందితులు శాలువతో గొంతుని బిగించి దారుణంగా హత్య చేశారు. హత్య అనంతరం నిందితులు మృతుడి కారులోనే హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లెడు గడ్డ తండా గ్రామ శివారులోని ఓ బావిలో మృతుడి మృతదేహాన్ని పడవేసి నిందితులు తిరిగి వేలేరు మీదుగా హన్మకొండ ఏషియన్ మాల్ ప్రాంతంలో కార్ను పార్క్ చేసినట్లుగా నిందితులు పోలీసుల విచారణలో వెల్లడించారు. మరుసటి రోజున మృతుడి మృతదేహాన్ని గుర్తించి జిల్లెడు గడ్డ తండా గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో అనుమాన్పడంగా మరణించిన వ్యక్తిగా హుస్నా బాద్ పోలీసులు కేసును నమోదు చేసుకున్నారు. ఈ కేసులో నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కబరిచిన హన్మకొండ ఏసిపి దేవేందర్ రెడ్డి, ఇన్స్స్పెక్టర్ సతీస్తో పాటు ఇతర పోలీస్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు. ఈ ప్రెస్ మీట్ లో ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, ఏ. ఎస్పీ మనన్ భట్ పాల్గొన్నారు.