ఎన్నికల సమీక్షకు హాజరు కావాలి

ఎన్నికల సమీక్షకు హాజరు కావాలి

– విధుల్లో మినహాయింపు లేదు

– జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

తెలంగాణ జ్యోతి, భూపాలపల్లి ప్రతినిధి : ఏప్రిల్ 2వ తేదీన ఉదయం 10 గంటలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఐడిఓసి కార్యాలయపు సమావేశపు హాలులో పార్లమెంటు ఎన్నికలు నిర్వహణకు విధులు కేటాయించిన నోడల్ అధికారులు, పోలీస్, అటవీ, ఆబ్కారీ, ఆదాయపు పన్ను శాఖ అధికారులతో పాటు స్టాటిక్ సర్వేలెన్సు, వీడియో సర్వేలెన్సు, ఫ్లైయింగ్, సెక్టార్ అధికారులు, తహసిల్ధార్లు, ఎంపిడిఓలకు నిర్వహించనున్న సమీక్షా సమావేశానికి అధికారులు సమగ్ర సమాచారంతో హాజరుకావాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. విధులు కేటాయించిన సిబ్బందికి ఎలాంటి మినహాయింపు. లేదని, సమావేశానికి గైర్హాజరైతే ఎన్నికల సంఘ నిబంధనల మేరకు తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment