తాడ్వాయిలో బీఆర్ఎస్ నేత రమణయ్యపై దాడి
తాడ్వాయి, డిసెంబర్ 12 (తెలంగాణ జ్యోతి): తాడ్వాయి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు, ఆత్మ కమిటీ ఛైర్మన్ దుర్గం రమణయ్యపై గురువారం రాత్రి పలువురు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన ఘటన స్థానికంగా ఉద్రిక్తతలకు దారితీసింది. విషయం తెలియడంతో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ బాబు హుటాహుటిన తాడ్వాయికి చేరుకుని రమణయ్యను పరామర్శించారు. దాడిపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దాడికి కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదని, పోలీసులు విచారణ ప్రారంభించినట్లు సమాచారం…






