ఘనంగా ఐలమ్మ వర్ధంతి వేడుకలు

Written by telangana jyothi

Published on:

ఘనంగా ఐలమ్మ వర్ధంతి వేడుకలు

తెలంగాణజ్యోతి, కన్నాయిగూడెం:మండల కేంద్రంలో రైతు వేదిక నందు మండల రజక సంఘం అధ్యక్షులు పైడాకుల సమ్మయ్య ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 39వ వర్థంతి వేడు కలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీవో అనిత, ఆశ్రమ ఉన్నత పాఠశాల తెలుగు పండితుడు కోటయ్య, పాల్గొనడం జరిగింది.పలువురు చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీరనారి చాకలి ఐలమ్మ భూమి కోసం భుక్తి కోసం రజకారులను ఎదిరించి పోరాడిన విరానిత చాకలి ఐలమ్మ అన్నారు. ఈ కార్యక్ర మంలో ఏఈఓ కల్యాణి, మండల రజక సంఘం ఉపాధ్య క్షుడు వేములవాడ రమేష్, కోశాధికారి సాయి బాబా, ప్రధాన కార్యదర్శి శ్రీరాముల సందీప్, కార్యదర్శి శ్రీరాముల రవి, గ్రామ అధ్యక్షులు శ్రీరాముల నరేష్, బడిపిల్లలు తదితరులు పాల్గొ న్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now