మేడారం జాతర వెళ్లేవారికి ఆధార్ తప్పనిసరి…

Written by telangana jyothi

Published on:

మేడారం జాతర వెళ్లేవారికి ఆధార్ తప్పనిసరి…

– కొనుగోలు చేసిన భక్తుల వివరాలను అందించాలి

– ఎక్సైజ్ శాఖ అధికారులు ఆధార్ కార్డు పెట్టుకుని

ములుగు, తెలంగాణ జ్యోతి : మేడారంలో ఎత్తు బంగారాన్ని (బెల్లం) కొనుగోలు చేసిన భక్తుల వివరాలను సేకరించి తమకు అందజేయాలని వ్యాపారులను ఎక్సైజ్ శాఖ ఆదేశించింది. భక్తుల నుంచి ఆధార్ జిరాక్స్, ఫోన్ నెంబర్, ఇంటి అడ్రస్ తీసుకుని బెల్లాన్ని విక్రయించాలని అధికారులు తెలిపారు. గుడుంబా తయారీకి బెల్లం పక్కదారి పట్టే అవకాశం ఉండడంతో ఈ నిబంధనలు పెట్టామన్నారు. గుడుంబా తయారీకి బెల్లాన్ని విక్రయించిన వారికి రూ. లక్ష జరిమానా విధిస్తామన్నారు. ఇది ఇలా ఉండగా, ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ సమ్మక్క సారలమ్మ జాతర ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఈ జాతరలో బంగారాన్ని (బెల్లం) అమ్మవార్లకు భక్తులు మొక్కుగా సమర్పించి తమ కోర్కెలు తీర్చాలని వేడుకుంటారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now