దంతేవాడలో మావోయిస్టుల డంప్ స్వాధీనం
డెస్క్ : చత్తీస్ గడ్ రాష్ట్రం, దంతేవాడ జిల్లా, బర్సూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుర్సిగ్బహార్ గ్రామ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల పేలుడు పదార్థాల డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ లో 10 కిలోల బరువున్న 3 పైప్ బాంబులు, 5 కిలోల బరువున్న 1 ప్రెషర్ కుక్కర్ ఐఇడి స్వాధీనం.బీడీఎస్ బృందం అక్కడికక్కడే అన్ని పేలుడు పదార్థాలను సురక్షితంగా నిర్వీర్యం చేసింది. ఆపరేషన్ లో CRPF, QAT, BDS బలగాలు పాల్గొన్నాయి.






