ఏసీబీ వలలో నందిగామ ఎంపీడీవో సుమతి
ఎంపీవో తేజ్ సింగ్, ఈదులపల్లి గ్రామ కార్యదర్శి చెన్నయ్య
రూ. లక్ష లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డ అధికారులు
హైదరాబాద్, జనవరి7, తెలంగాణ జ్యోతి : రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో లంచం డిమాండ్ చేసిన ఘటన తీవ్ర సంచలనం రేపింది. నందిగామ మండలానికి చెందిన ఎంపీడీవో సుమతి, ఎంపీవో తేజ్ సింగ్, ఈదులపల్లి గ్రామ కార్యదర్శి చెన్నయ్యలు ఓ భవన నిర్మాణ అనుమతుల కు సంబంధించి రూ.1 లక్ష లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యం లో జరిగిన ఈ దాడిలో ముగ్గురు అధికారులు అడ్డంగా బుక్ అయ్యారు. ఘటనపై పూర్తి వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది.





