బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం 

Written by telangana jyothi

Published on:

బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం 

 ఏటూరునాగారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమార్రి లక్ష్మణ్ బాబు ఆదేశాల మేరకు మండల పార్టీ అధ్యక్షులు గడదాసు సునీల్ కుమార్ పిలుపుమేరకు 2వ ఎంపీటీసీ, 6 వ వార్డు, అంబేద్కర్ నగర్, నేతకాని కాలనీ లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి .జిల్లా కొ ఆప్షన్ ఎండి వలియాబి సలీం, ఎంపీపీ ఎంతటి విజయ నాగరాజులు హాజరై బి ఆర్ ఎస్ నాయకులు ప్రచారంలో భాగంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ మేనిఫెస్టోలో పెట్టిన అన్ని పథకాలను అమలు చేయడంలో కెసిఆర్ ముందు ఉంటాడని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే సంక్షేమ పథకాలను నెంబర్ వన్ గా అమలు చేస్తుందని తెలిపారు. ములుగు ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో. వార్డ్ మెంబర్ జాడి స్వప్న బోజరావు. ముంజ రాజేందర్. గండేపల్లి నరసయ్య ,కొండాయి చిన్ని,ఉమ్మ గాని యాకయ్య, వెంకట్ రెడ్డి. ఎండి గౌస్. అశోక్ బానారి సమ్మయ్య. కావిరి సమ్మయ్య.జాడి నరసింహారావు,నాగుల నరసయ్య , జాడి రాజు . జనగం మేస్త్రి సమ్మక్క.జాడి మల్లక్క. జనగం రవీందర్. జాడి భార్గవ్. రామ టెంకి. రాజకుమార్ మరి కాల వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

Tj news

1 thought on “బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం ”

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now