ఉచిత పాఠ్యసామగ్రి పంపిణీ చేసిన డిఈఓ
ములుగు ప్రతినిధి, జూన్ 12, తెలంగాణ జ్యోతి : ములుగు మండలం బండారుపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలలో గురువారం విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, ఏకరూప దుస్తుల పంపిణీని నిర్వహించగా డీఈఓ హాజరై అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఉపాధ్యాయులు నిబద్ధతతో పనిచేయాలని, మానవీయ విలువలతో విద్యను అందిస్తూ ప్రభుత్వ పాఠశాలల నాణ్యతను సమాజానికి చాటి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరసింహమూర్తి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.