విద్యుత్ షాక్ తో యువకుడు మృతి

విద్యుత్ షాక్ తో యువకుడు మృతి

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రం శివారు బి. సి. మర్రిగూడెం గ్రామానికి చెందిన బొల్లె ప్రశాంత్ (25) శనివారం రాత్రి తన ఇంటి వద్ద ఫ్యాన్ తీస్తుండగా విద్యుత్ షాక్ గురై అక్కడికి కక్కడే మృతి చెందారు. ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటు జీవనం సాగిస్తున్న ప్రశాంత్ కు బాబు, భార్య ఉన్నారు. విద్యుత్ షాక్ గురై పడిపోయిన వెంటనే వెంకటాపు రం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే ప్రశాంత్ మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు. ఎప్పుడూ నవ్వుతూ కలుపుగోలుగా ఉల్లాసంగా అందర్నీ మంచిగా పలకరించే ప్రశాంత్ షాక్ గురై మృతి చెందడంతో బీసీ మర్రిగూడెం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

[metaslider id="19893"]

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment