శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్న కరీంనగర్ ఎలక్షన్ అబ్జర్వర్..
కాళేశ్వరం,తెలంగాణ జ్యోతి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహాదేవపూర్ మండలం, కాళేశ్వరం లోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ని కరీంనగర్ ఎలక్షన్ అబ్జర్వర్ శ్రీ యోగేష్ సుఖదేవ్ (I R S ) దంపతులు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ శుభానందదేవి అమ్మవారి ఆలయంలో అర్చకులు వారికి స్వామి వారి శేషవస్త్రాల తో ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.
మహాదేవపూర్ మండల ప్రతినిధి /ఆరవెల్లి సంపత్ కుమార్