కోటగుళ్లలో ఘనంగా శుక్రవారం పూజలు

కోటగుళ్లలో ఘనంగా శుక్రవారం పూజలు

– లలిత నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో మహిళలకు వాయినాల సమర్పణ

– దీప దానాలు చేసిన మహిళలు

– భక్తులతో కిక్కిరిసిన ఆలయం

గణపురం, డిసెంబరు 1, తెలంగాణ జ్యోతి : కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ల కు కార్తిక శోభ సంతరించుకుంది. కార్తీక మాస ఉత్సవాలలో భాగంగా శుక్రవారం కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం గణపతి పూజతో అర్చకులు నరేష్ కార్యక్రమాలను ప్రారంభించగా అనంతరం పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో స్వామి వారికి రుద్రాభి షేకం పట్టు వస్త్రాలతో ప్రత్యేక అలంకరణ నిర్వహించారు. అదే విధంగా పరకాల లలిత నర్సింగ్ హోమ్ నిర్వాహకులు డాక్టర్ లలితాదేవి రాజేశ్వర ప్రసాద్ దంపతుల ఆధ్వర్యంలో మహిళలకు వాయినాలు సమర్పించారు. అనంతరం మహిళలు దీప దానాలు చేయడంతో పాటు నందీశ్వరుడు, తులసి, మేడీ, రావి ఉసిరి, మారేడు, నాగదేవుని, పుట్ట వద్ద దీపాలను వెలిగించారు. అనంతరం అర్చకులు నరేష్ భక్తులకు తీర్థ ప్రసాదాలను ఆశీర్వచనాలు అందజేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తుల రద్దీ కొనసాగింది.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment