శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర ఆలయాన్ని దర్శించుకున్న తెలంగాణ డిజిపి

శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర ఆలయాన్ని దర్శించుకున్న తెలంగాణ డిజిపి

మహాదేవపూర్ తెలంగాణ జ్యోతి ప్రతినిధి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం లోని దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని  తెలంగాణ రాష్ట్ర డీ జీ పి అంజనీ కుమార్ దర్శించుకున్నారు.  ముందుగా వారికి ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలకగా దర్శనం అనంతరం ఆలయ ధర్మకర్తలు అడప సమ్మయ్య ,కామిడీ రాంరెడ్డి స్వామి లు శేష వస్త్రాలతో సన్మానించారు.  అనంతరం అర్చకులు ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాటారం డీ ఎస్ పీ రామ్మోహన్ రెడ్డి, మహదేవపూర్ సీ ఐ కిరణ్ కుమార్,  కాళేశ్వరం ఎస్ ఐ లక్ష్మణ్ రావు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment