రేగులగూడెంలో ఇంటింటికి కాంగ్రెస్ ప్రచారం

Written by telangana jyothi

Published on:

రేగులగూడెంలో ఇంటింటికి కాంగ్రెస్ ప్రచారం

 తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంథని శాసనసభ నియోజకవర్గం పరిధిలోని కాటారం మండలం రేగులగూడెంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాటారం మండల పరిషత్ అధ్యక్షులు పంతకాని సమ్మయ్య మాట్లాడుతూ గడపగడపకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దుద్దిల్ల శ్రీధర్ బాబు గెలుపునకు ప్రజలను చైతన్యవంతులు చేస్తూ ఆరు గ్యారెంటీ పథకాల కార్డులతో విస్తృత ప్రచారం చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ అధ్యక్షులు కుంభం రమేష్ రెడ్డి, దేవరాం పల్లి మాజీ సర్పంచ్ నవీన్ రావు, బండి రమేష్, డిసిసి మహిళా కార్యదర్శి డాక్టర్ ఏలుబాక సుజాత, బండారి శ్రీధర్, దేవేందర్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Tj news

1 thought on “రేగులగూడెంలో ఇంటింటికి కాంగ్రెస్ ప్రచారం”

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now