ప్రజా ఆశీర్వాద సభ పనులను ప్రారంభించిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ జ్యోతి, నవంబర్ 19, ములుగు ప్రతినిధి : ములుగు నియోజకవర్గం తంగేడు స్టేడియంలో ఈ నెల 24న నిర్వహించ నున్న ప్రజా ఆశీర్వాద సభ, హెలిప్యాడ్ ల్యాండింగ్, పార్కింగ్ స్థలాల పనులను కొబ్బరికాయ కొట్టి ఎమ్మెల్సీ శ్రీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ జెడ్పీచైర్మన్, రెండు మండలాల ఎన్నికల ఇంచార్జ్ సాంబారి సమ్మారావు, రాష్ట్ర రోడ్డు అభివృద్ధి సంస్థ చైర్మన్ నాలుగు మండలాల ఎన్నికల ఇంచార్జ్ మెట్టు శ్రీనివాస్, రెడ్కో చైర్మన్ మూడు మండలాల ఎన్నికల ఇంచార్జ్ వై సతీష్ రెడ్డి, ములుగు జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద నాయక్, స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు తదితరులు పాల్గొన్నారు.