జర్నలిస్టులకు జంబూద్వీప జాతుల సమాఖ్య మద్దతు
తెలంగాణ జ్యోతి నవంబర్ 21, వెంకటాపూర్ : ఇండ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కోరుతూ జర్నలిస్టులు చేస్తున్న పోరాటానికి జంబూ ద్వీప జాతుల సమాఖ్య మద్దతుగా నిలిచింది. మంగళవారం పాలంపేట గ్రామంలో జర్నలిస్టులు ఏర్పాటు చేసిన కాలనీ వద్ద సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు సాగర్ మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన జర్నలిస్టులు అదే ఉద్యమస్ఫూర్తితో ములుగు జిల్లా సాధన ఉద్యమంలో సైతం పాల్గొన్నారని అన్నారు. అలాంటి జర్నలిస్టులు నేడు ఇంటి స్థలాలతో పాటు ఇళ్ళ కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడడం బాధాకరమని అన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంతోపాటు ఇండ్లు నిర్మించేంతవరకు వారికి జంబు ద్వీప జాతుల సమాఖ్య అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటి కైనా ములుగు జిల్లా కలెక్టర్ స్పందించి వెంకటాపూర్ జర్నలిస్టులకు ఇంటిస్థలాలు కేటాయించి వాటికి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జంబుద్వీప సమైక్య కోశాధికా రి బొట్ల రాజేందర్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ కరుణాల భద్రాచలం ,మచ్చ శ్రీరామమూర్తి తో పాటు జర్నలిస్టులు బేతి సతీష్ , ఒద్దుల మురళి, మామిడిశెట్టి ధర్మ, దేశిని మహేందర్, దండేపల్లి సారంగం, ఆకుల రామకృష్ణ, గట్టు ప్రశాంత్, బిరెల్లి రమేష్, పిల్లలమర్రి శివరాం, రంగీ శెట్టి రాజేందర్, తీగల యుగేందర్, మామిడ్ల సంపత్, పోశాల చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.