చెరుకూరు రహదారిపై విస్తృతంగా వాహనాలు తనిఖీలు.
వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిది : ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్ సర్కిల్ పరిధిలోని వాజేడు మండలం చెరుకూరు గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం వాజేడు పోలీసుల ఆధ్వర్యంలో విస్తృతంగా వాహనాలు తనిఖీలను నిర్వహించారు. వాజేడు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర రావు ఆధ్వర్యంలో వచ్చే పోయే వాహనాలను తనిఖీ లు నిర్వహించి అపరిచిత వ్యక్తుల సమాచారాన్ని రాబట్టారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం తనిఖీల కార్యక్రమాన్ని పోలీస్ శాఖ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వాజేడు సివిల్ పోలీస్ తో పాటు, సిఆర్పిఎఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
1 thought on “చెరుకూరు రహదారిపై విస్తృతంగా వాహనాలు తనిఖీలు. ”