ఏ.టి.సి. నైపుణ్య కోర్సులను యువత సద్వినియోగం చేసుకోవాలి 

ఏ.టి.సి. నైపుణ్య కోర్సులను యువత సద్వినియోగం చేసుకోవాలి 

ఏ.టి.సి. నైపుణ్య కోర్సులను యువత సద్వినియోగం చేసుకోవాలి 

– జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.

వెంకటాపురం, అక్టోబర్ 7 తెలంగాణ జ్యోతి : ఏ.టి.సి నైపుణ్య కోర్సు లను యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ఏటూరు నాగారం, వాజేడు మండలాల్లోని ప్రభుత్వ ఆర్‌.ఐ.టి.ఐ, ఎ.టి.సి శిక్షణా కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన క్యాంపస్‌లను పరిశీలించి, సిబ్బంది, శిక్షణార్థులతో మాట్లాడారు. శిక్షణా కార్యక్రమాల పురోగతి, సదుపాయాలు, ఏ.టి.సి పనుల స్థితి వంటి అంశాలను సమీక్షించారు. ఏ.టి.సి కోసం వచ్చిన మెషినరీ, ఫర్నిచర్, పూర్తి కావలసిన పెండింగ్ పనులు, రిక్రూట్ అయిన ట్రైనర్స్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందుబాటులో ఉన్న సదుపాయాలను కూడా పరిశీలించారు. కలెక్టర్ దివాకర టి.ఎస్. మాట్లాడుతూ శిక్షణ నాణ్యత, వృత్తి విద్యా సదుపాయాల విస్తరణ, విద్యార్థుల ప్రాక్టికల్ నైపుణ్యా భివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.విద్యార్థుల శిక్షణా ప్రమాణాలను మరింత మెరుగుపరచి, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా శిక్షణా విధానాలను నవీకరించాలిన్నారు. అలాగే ప్రస్తుత ఏ.టి.సి సెంటర్ ద్వారా అందించే నైపుణ్య శిక్షణ చాలా ప్రాముఖ్యమైందని పేర్కొన్నారు. తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చే దిశగా విద్యార్థులు కృషి చేసి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏటూరు నాగారం ప్రిన్సిపాల్ ఎస్. జగన్మోహన్ రెడ్డి, వాజేడు ప్రిన్సిపాల్ శేఖర్, ఎం.పి.డీ.ఓలు, తహసీల్దార్లు, సంబంధిత అధికారులు, ఇన్‌స్ట్రక్టర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment