నేరాల నియంత్రణకు సమర్ధవంతంగా పనిచేయాలి 

నేరాల నియంత్రణకు సమర్ధవంతంగా పనిచేయాలి 

నేరాల నియంత్రణకు సమర్ధవంతంగా పనిచేయాలి 

– జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే 

కాటారం,జూన్28 , తెలంగాణ జ్యోతి : పోలీసు అధికారులు, సిబ్బంది నేరాల నియంత్రణకు సమర్ధవంతంగా పనిచేయాలనీ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు స్టేషన్లలో నేరాల నమోదు, పెండింగ్ కేసులు, ఎన్బిఎం వారెంట్లు, ఎస్సీ, ఎస్టీ కేసులు, మహిళలకు వ్యతిరేకంగా జరిగే నేరాలు, పోక్సో కేసులు, కోర్టు మానిటరింగ్, శిక్షల అమలుపై చర్చించి, పోలీసు అధికారులకు మార్గనిర్దేశం చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పోలీసు విధులను విజిబుల్ పోలిసింగ్ తో పాటు ప్రభావవంతంగా నిర్వర్తించాని అన్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నందున పోలీసు అధికారులు, సిబ్బంది పకడ్బంది గా పని చేయాలని, గ్రామాలలో జరిగే శాంతి భద్రతల అంశాల ను ముందస్తు సంచారం సేకరించి సమస్యలు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.  పోలీసుల పనితీరు ను సమీక్షించేందుకు ఏర్పాటు చేసిన ఫంక్షన్ వర్టికల్ లలో ఎవ్వరికి కేటాయించినా విధులను వారు అప్డేట్ చేస్తూ మెరుగు పరచు కోవాలని సూచించారు. సైబర్ మోసాలపై, మహిళా భద్రతపై అవగాహన కల్పించాలనీ,సీసీ కెమెరాలు ఏర్పాటు కోసం ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు. పోలీసు అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, సత్వరంగా సేవలు అందించాలని పేర్కొన్నారు. అలాగే అక్రమ రవాణా జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని, నిత్యం వాహన తనిఖీలు చేయాలని ఎస్పీ కిరణ్ ఖరే పేర్కొన్నారు. అలాగే జిల్లాలో రౌడి షిటర్స్ పై నిఘా ఏర్పాటు చేయాలని, ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ ఏ.నరేష్ కుమార్, భూపాలపల్లి, కాటారం, డిఎస్పీలు సంపత్ రావు, సూర్య నారాయణ, నారా యణ నాయక్, జిల్లా పరిధిలోని సిఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

నేరాల నియంత్రణకు సమర్ధవంతంగా పనిచేయాలి 

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment