పూసూరు గోదావరి వంతెన సమీపంలో వాహన తనిఖీలు. 

Written by telangana jyothi

Published on:

పూసూరు గోదావరి వంతెన సమీపంలో వాహన తనిఖీలు. 

వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం పోలీస్ సర్కిల్ పరిధిలోని వాజేడు మండలం పూసూరు గోదావరి వంతెన సమీపంలో సోమవారం సాయంత్రం వాజేడు పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ రహదారిపై వచ్చే పోయే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి అపరిచిత వ్యక్తుల సమాచారాన్ని రాబట్టారు. వాజేడు పోలీస్ స్టేషన్ సివిల్ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో, వాహనాలు తనిఖీల కార్యక్రమం నిర్వహించి, ఇంధన శకట వాహనదారులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్క వాహనానికి సంబంధించిన ధ్రువపత్రాలు కలిగి ఉండాలని, వాహన చోదకులు లైసెన్సులు కలిగి ఉండాలని, ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారు శిరస్సురక్షణ కవచాలు ధరించాలని, రోడ్డు ప్రయాణ భద్రత అంశాలపై ఎస్సై వెంకటేశ్వరరావు అవగాహన కల్పించారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడపరాదని వాహనదారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాజేడు పి.ఎస్. సివిల్ పోలీస్ తో పాటు సిఆర్పిఎఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tj news

1 thought on “పూసూరు గోదావరి వంతెన సమీపంలో వాహన తనిఖీలు. ”

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now