నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నా నిర్లక్ష్యం చేస్తుండ్లు
– కన్నెపల్లి మోటార్లతో వరద ప్రవాహాన్నిఎత్తిపోయచ్చు
– ఈ ప్రాంత రైతుల గోసను పట్టించుకోని మంథని ఎమ్మెల్యే
– సర్కారు స్పందించకపోతే పోరాటం తప్పదు
– మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్..
మహాదేవపూర్,జులై7,తెలంగాణజ్యోతి:వర్షాభావ పరిస్థితుల వల్ల ప్రస్తుతం మహారాష్ట్ర నుంచి వస్తున్న వరద ప్రవాహాన్ని కన్నెపల్లి మోటార్ల ద్వారా ఎత్తిపోసే అవకాశమున్న రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం చేసి, రైతులను మోసం చేస్తుందని, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం ప్రాజెక్టు కన్నెపల్లి పంపుహౌజ్ ను ఆయన పరిశీలించి విలేకరులతో మాట్లాడారు. మేడిగడ్డ బ్యారేజ్ గేట్లు వేసి నీటినీ నిల్వ చేయకుండానే కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటినీ ఎత్తిపోసే అవకాశముందని అన్నారు. జులై 7 వచ్చిన వర్షాలు లేకపోవడంతో గోదావరి పరిహాక ప్రాంతాల్లో చెరువులు, కుంటలు, కాలువలు నీరు లేక ఎండిపోయి రైతులు వరి నారూ మడులు అలికే పరిస్థితులు కనబడడం లేదన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు ను రేవంత్ సర్కార్ తో కలిసి స్థానిక శాసనసభ్యుడు మంత్రి శ్రీధర్ బాబు నిర్లక్ష్యం చేశారన్నారు. మంథని ఎమ్మెల్యే గద్ద తన పిల్లలను తానే చంపుకుని తిన్న చందంగా మంథని ప్రజల పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. అన్నారం, సుందిళ్ళ బ్యారేజ్లను నీరు లేక ఎండిపోతున్న దృశ్యం కనబడుతుందన్నారు. భూగర్భ జలాలు వట్టిపోయాయని, మత్స్య సంపాదకు ఆటంకాలు ఏర్పడ్డాయన్నారు. హరీష్ రావు చెప్పినట్టు గోదావరిలో ప్రస్తుతం ఉన్న నీటిని కన్నె పెళ్లి మోటార్ల ద్వారా వాడుకోవచ్చని, ,వాటిని వినియోగిస్తే తెలంగాణకు సుమారు 15 జిల్లాలకు నీరు అందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ స్పందించి మోటర్లు ఆన్ చేసి నడిపించాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున పోరాటం తప్పదన్నారు. ఆయన వెంట నాయకులు మోహన్ రెడ్డి ఉన్నారు.