ఈనాడు–ఈటీవీ పోటీల్లో బ్రిలియంట్ విద్యార్థుల ప్రతిభ
ములుగు, ఫిబ్రవరి 5, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా కేంద్రంలోని బ్రిలియంట్, వివేకవర్ధిని హైస్కూల్ లో ఈనాడు -ఈటీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎలక్యూషన్, వ్యాసరచన, డ్రాయింగ్, స్పీచ్ పోటీల్లో విద్యార్థులు ప్రతిభను చాటారు. విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చి బహుమతులు అందుకున్నారు. వ్యాస రచన విభాగంలో 9వ తరగతి విద్యార్థిని కె.రవళి మొదటి బహుమతి అందుకోగా, ఎలక్యూషన్ విభాగంలో 9వ తరగతి విద్యార్థి ఎస్.శ్రీనివాస్ మొదటి బహుమతి, వి.సిద్ధార్థ్ మూడో బహుమతిని గెలుచుకున్నారు. ఈ సందర్భంగా విజేతలను పాఠశాల యాజమాన్యం సంతోష్ చక్రవర్తి, చిర్రా నరేష్ గౌడ్ లు అభినందిస్తూ వారి విజయంలో కీలక పాత్ర పోషించిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు.






