ఇసుక ర్యాంపులో జరుగుతున్న అక్రమాలు ఆపాలి

ఇసుక ర్యాంపులో జరుగుతున్న అక్రమాలు ఆపాలి

ఇసుక ర్యాంపులో జరుగుతున్న అక్రమాలు ఆపాలి

– ర్యాంపు పనులు ఆపాలని సిపిఎం,బిఆర్ఎస్ పార్టీల డిమాండ్.

వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండలం ధర్మవరం (పట్టా భూములు) ఇసుక ర్యాంపు గుత్తేదారులపై చర్యలు తీసుకోని ఇసుక ర్యాంపు పనులు నిలుపుదల చేయాలనీ కోరుతూ సిపిఎం, బిఆర్ఎస్ పార్టీలు ఆధ్వర్యంలో శుక్రువారం తహసీల్దార్ కి వినతిపత్రం అందజే శారు. ఈ సందర్బంగా బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పి రామకృష్ణారెడ్డి, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ నాయకులు మాట్లాడుతూ ఏజెన్సీ చట్టాలను ఉల్లంగిస్తూ ధర్మవరం (పట్టా భూముల)ఇసుక ర్యాంపు గుత్తేదారులు అనుమతులు తీసు కున్న సర్వే నెంబర్లలో కాకుండా అనుమతి లేని చోట గోదావరి లో ఇసుక తవ్వకాలు జరుపుతూ పరిమితికి మించి తవ్వకాలు జరుపుతూ, తమ మండలానికి సంబందిం చిన సహజ వనరులను కోళ్లగొడుతూ, ప్రభుత్వ ఆదాయానికి గండిపెడుతూ ప్రభుత్వాన్ని, మండల ప్రజానీకాన్ని మోసం చేస్తున్నారని తెలిపారు. ఇసుక ర్యాంపు గుత్తేదారులపై చర్యలు తీసుకోని ర్యాంపు పనులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో బిఆర్ఎస్ వాజేడు మండల అధ్యక్షులు పి రామకృష్ణారెడ్డి, సిపిఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment