మేడిగడ్డ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి

మేడిగడ్డ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి

మేడిగడ్డ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి

– రక్షణ చర్యలు చేపట్టడం లో సర్కారు విఫలం 

– మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించాలి

– మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ 

కాటారం, జూన్ 8, తెలంగాణ జ్యోతి : మేడిగడ్డ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ డిమాండ్ చేశారు. ఆదివారం మహాదేవపూర్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మేడిగడ్డ బ్యారేజ్ వద్ద గల్లంతైన యువకుల కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మేడిగడ్డ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగానే పక్కన పెట్టిందని, అక్కడ వరద ప్రవాహాం పెరుగుతుందని తెలిసినా కనీస అక్కడ ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే అభం శుభం తెలియని ఆరుగురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారని, ఇందుకు ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఒక్కో బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా అందించి అన్ని విధాల ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మేడిగడ్డ ప్రాజెక్టు వద్దకు పర్యాటకుల తాకిడి పెరిగే అవకాశం ఉందని, ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా అక్కడ ప్రభుత్వం రక్షణ చర్యలు చేపట్టాలన్నారు.

పలు కుటుంబాలకు పరామర్శ

మంథని మజీ ఎం ఎల్ ఏ పుట్ట మధుకర్ కాటారం మండలం గంగారాం గ్రామంలో చిట్యాల దుర్గయ్య అనారోగ్యం తో మరణించగా, మారాపాక మధునమ్మ, నీలాల బాలయ్య కారు యాక్సిడెంట్లో మరణించారు. కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు. కాటారం మండలం చింతకాని గ్రామంలో మందల శ్రీలత – ప్రభాకర్ రెడ్డి పుత్రిక లు ఐశ్వర్య రాణి, సిరి వెన్నెల నూతన వస్త్రాలంకరణ మహోత్సవం లో పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ అధ్యక్షుడు జోడు శ్రీనివాస్, యువత అధ్యక్షుడు రామిల్ల కిరణ్, నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షుడు పంత కాని సడువలి, కొండపర్తి రవి, లక్ష్మీ చౌదరి, ఊర వెంకటేశ్వర్రావు, ఉప్పు సంతోష్, గాజుల విక్రం కుమార్, చిట్యాల సమ్మయ్య, నాయకు లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment