విద్యాశాఖాధికారిని సర్వీస్ నుండి తొలగించాలి
– ఎస్ఎఫ్ఐ ములుగు జిల్లా డిమాండ్
ములుగు ప్రతినిధి, జూన్16, తెలంగాణ జ్యోతి : అవినీతికి పాల్పడి ఏసీబీకి దొరికిన ములుగు జిల్లా విద్యాశాఖ అధికారి జి.పాణిని తక్షణమే సర్వీసు నుండి తొలగించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ములుగు జిల్లా కార్యదర్శి టి.ఎల్. రవి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “జిల్లా విద్యాశాఖాధికారి పాణిని అవినీతికి పాల్పడుతున్న విషయాన్ని గతంలోనే పలుమార్లు సంబంధిత ఉన్నతాధికారులకు నివేదించామన్నారు. గత మూడు సంవత్స రాలుగా పాఠశాలల్లోని కొంతమంది ఉపాధ్యాయులను దళారు లుగా నియమించి బదిలీలు, పదోన్నతులు, సర్దుబాటుల పేరుతో తీవ్ర అవినీతికి పాల్పడ్డాడని ఆరోపించారు. ఏజెన్సీ ప్రాంత ఉపాధ్యాయులను మైదాన ప్రాంతాలకు సర్దుబాటు చేసి డబ్బులు వసూలు చేయడం వల్ల గిరిజన విద్యార్థుల విద్యా హక్కులను హరిస్తున్నారని పేర్కొన్నారు. అవినీతి అధికారుల జిల్లా విద్యాశాఖను పూర్తిగా పరిశీలించి, న్యాయ విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే విద్యార్థి సంఘాల ద్వారా పెద్దస్థాయిలో ఉద్యమాలు, ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.