ఉరుసు ఉత్సవాల కోసం తానే లెవల్ చేస్తున్న ఉప సర్పంచ్
కన్నాయిగూడెం,ఫిబ్రవరి3,తెలంగాణజ్యోతి:మండలంలోనిమొప్పనపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న దర్గా ఉరుసు ఉత్సవాల సందర్భంగా ఉప సర్పంచ్ చిదరి సుమన్ స్వయంగా రంగంలోకి దిగారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు రాకపోకల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తన సొంత ట్రాక్టర్తో రోడ్లను లెవల్ చేస్తూ మరమ్మతు పనులు చేపట్టారు. ప్రజాప్రతినిధిగా బాధ్యతతో పాటు సేవాభావంతో పనిచేస్తున్న ఉప సర్పంచ్ సుమన్ను గ్రామస్తులు, దర్గా కమిటీ సభ్యులు అభినందిస్తూ ప్రశంసలు కురిపించారు.






