రోడ్డు ప్రమాదాల నివారణకు తెచ్చిన కేంద్ర చట్టాన్ని ఉపసంహరించుకోవాలి
– ప్రజా సంఘాల జిల్లా నాయకుడు పీక కిరణ్ డిమాండ్
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: రోడ్డు ప్రమాదాల నివారణ కు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కఠిన చట్టాన్ని వెంటనే ఉపసంహ రించు కోవాలని ప్రజా సంఘాల జిల్లా నాయకుడు పీక కిరణ్ డిమాండ్ చేశారు. మంగళ వారం కాటారంలో పత్రిక విలేకరుల సమావేశంలో పీక కిరణ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ట్రక్కు లారీ డ్రైవర్లు సమ్మె లో పాల్గొంటున్నారని పేర్కొన్నారు.ఈ కొత్త చట్టం ప్రకారం ప్రమాదా లు జరిగితే డ్రైవర్లకు పదేళ్లు జైలు శిక్షతోపాటు రూ. 7 లక్షల జరిమానా విధిస్తూ తీసుకున్న నిర్ణయం మోటారు రంగ కార్మికులకు గుదిబండగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు . ఈ చట్టం వల్ల మోటారు రంగా కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కో వాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మోటారు రంగ కార్మికు లకు వచ్చే జీతాలలో వారి కుటుంబాలను పోషించుకోవడమే కష్టంగా మారిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.ప్రజల యొక్క అవసరా లను దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా జరుగుతున్న ట్రక్కు, లారీల సమ్మెను విరమింపచేయుటకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాల ని కోరారు. ప్రభుత్వం స్పందించని ఎడల సమ్మె మరింత ఉదృతం గా మారే ప్రమాదం ఉందని పీక కిరణ్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిం చారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని సూచించారు.
1 thought on “రోడ్డు ప్రమాదాల నివారణకు తెచ్చిన కేంద్ర చట్టాన్ని ఉపసంహరించుకోవాలి”