ఏటూరునాగారం అటవీప్రాంతంలో ఉద్రిక్తత

ఏటూరునాగారం అటవీప్రాంతంలో ఉద్రిక్తత

ఏటూరునాగారం అటవీప్రాంతంలో ఉద్రిక్తత

– కళ్లలో కారం కొట్టి, జేసీబీని ధ్వంసం చేసిన ఆదివాసులు

ములుగు ప్రతినిధి, జూన్16, తెలంగాణ జ్యోతి : ఏటూరు నాగారం మండలం చల్పాక అటవీ ప్రాంతంలో సోమవారం ఆదివాసులు, అధికారుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. గిరిజనులు వేసుకున్న గుడిసెలను తొలగించేందుకు అటవీశాఖ అధికారులు, పోలీసులతో కలిసి వచ్చిన సమయంలో గిరిజనులు తీవ్రంగా ప్రతిఘటించారు. అధికారుల కళ్లలో కారం చల్లి, కర్రలు, కత్తులతో దాడికి దిగారు. అధికారులు తీసుకువచ్చిన  జేసీబీ వాహన అద్దాలను ధ్వంసం చేశారు. రెండేళ్లుగా అదే అడవిలో నివాసముంటున్నామన్న గిరిజనులు, తమ గుడిసెలను ఖాళీ చేయాలన్న ప్రభుత్వ యంత్రాంగ ఆదేశాలను ఖండించారు. ఇది మా భూమి, మేము ఇక్కడే ఉంటామనీ స్పష్టం చేస్తున్నారు. అధికారుల తీరుపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో అక్కడ కొన్ని గంటల పాటు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అప్రమత్తమైన అధికారులు అక్కడి నుంచి పోలీసుల సాయంతో వెనక్కి తగ్గారు. విషయాన్ని స్థానిక అధికారులు ఉన్నతాధికారులకు చేరవేశారు. తదుపరి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని వారు పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment