ఇంటింటి సర్వేను తనిఖీ చేసిన తహసిల్దార్

ఇంటింటి సర్వేను తనిఖీ చేసిన తహసిల్దార్

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలంలోని 18 పంచాయ తీలలో జరుగుతున్న సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీ య, కుల సర్వే ను మండల తాసిల్దార్ లక్ష్మీ రాజయ్య శని వారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఇంటింటి సర్వే లో భాగంగా సర్వే బృందాలు వారి, వారి ఇళ్లకు వెళ్లి సమగ్రం గా వివరాలు నమోదు చేసుకొని డోర్ స్లిప్పులను అప్పటిక ప్పుడు అతికిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేప ట్టిన ఇంటింటి సమగ్ర సర్వే కార్యక్రమంలో భాగంగా పూర్తి స్థాయి సమాచారాన్ని పకడ్బంబందీగా సేకరించి నమోదు చే యాలని  తాసిల్దార్ లక్ష్మీరాజయ్య సర్వే సిబ్బందిని ఆదేశిం చారు. మండలంలోని చొక్కాల, విఆర్కే పురం, ఇప్పలగూడెం ఇతర గ్రామాల్లో జరుగుతున్న ఇంటింటి సర్వేని ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్వే బృందాలు, రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

[metaslider id="19893"]

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment