బొగత జలపాతం వద్ద సండే సందడి
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలోని బొగత జలపాతం వద్ద ఆదివారం సెలవు కావడంతో పర్యాటకుల సందడి నెలకొంది. దూర ప్రాంతాల నుండి, వివిధ పట్టణాల నుండి వస్తున్న పర్యాటకులు ప్రకృతి రమణీయ దృశ్యమైన కొండలపై నుండి జాలువారే జలపాతాన్ని చూసి ఎంజాయ్ చేశారు. జలపాతాల వద్ద సెల్ఫీలు తీసుకొని ఆనందంగా గడిపారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు బొగత జలపాతం ఉప్పొంగిన జలదారలతో పర్యటకులను కనువిందు చేస్తున్నది.