మావోయిస్టులకు సహకరిస్తే కఠిన చర్యలు

మావోయిస్టులకు సహకరిస్తే కఠిన చర్యలు

మావోయిస్టులకు సహకరిస్తే కఠిన చర్యలు

– ఏఎస్పీ శివం ఉపాధ్యాయ,ఐపిఎస్.

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం బోదాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని అటవీ ప్రాంతమైన సీతారాంపురం గ్రామాన్ని సోమ వారం ఏటూరునాగారం ఏ.ఎస్పీ శివం ఉపాధ్యాయ ఆధ్వర్యం లో కార్డన్ అండ్ సెర్చ్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏ ఎస్ పి మాట్లాడుతూ మావోయిస్టులకు ఎవరు సహకరించ వద్దని, సహకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అపరిచిత, అనుమానిత వ్యక్తులు ఎవరైనా గ్రామ పరిసర ప్రాంతాలలో సంచరిస్తే పోలీస్ వారికి తెలియజేయాలని కోరారు. రాబోయే వర్షాకాలంలో వాగులు ఉదృతంగా ప్రవహించే అవకాశం ఉన్నందున ప్రవహిస్తున్న వాగులు దాటొద్దని, ఎవరు చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు. అదే విధంగా గ్రామస్తులకు దోమ తెరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై కే. తిరుపతిరావు, సివిల్, అలుబాక బేస్ క్యాంపు సిఆర్పిఎఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment