విత్తనాలు నాణ్యత లేకున్నా, అధిక ధరలకు అమ్మినా కఠిన చర్యలు

విత్తనాలు నాణ్యత లేకున్నా, అధిక ధరలకు అమ్మినా కఠిన చర్యలు

విత్తనాలు నాణ్యత లేకున్నా, అధిక ధరలకు అమ్మినా కఠిన చర్యలు

– గుర్తింపు ఉన్న కేంద్రాల్లోనే రైతులు కొనుగోలు చేయాలి

– జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్

– విత్తన ఎరువులు, పురుగుమందుల డీలర్లకు శిక్షణ 

ములుగు ప్రతినిధి, జూన్ 4, తెలంగాణ జ్యోతి : ప్రభుత్వ గుర్తింపు పొందిన విక్రయ కేంద్రాల్లోనే రైతులు కొనుగోలు చేయాలని, వ్యాపారులు నాణ్యమైన విత్తనాలను మాత్రమే అమ్మాలని, విత్తనాలు అధిక ధరలకు, కల్తీ, నాణ్యత లేని విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్ లో కలెక్టర్ అధ్యక్షతన వ్యవసాయ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ములుగు జిల్లాలోని విత్తన ఎరువులు, పురుగు మందుల డీలర్ల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విత్తన డీలర్లు అందరూ ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని, వ్యవసాయ శాఖ సూచనల మేరకు విత్తన కొనుగోలు చేసిన ప్రతీ రైతుకు బిల్ ఇవ్వాలని సూచించారు. ఆ బిల్లుపై లాట్ నెంబర్, ఎక్స్పైరీ డేట్, రైతు పూర్తి వివరాలు రాయాలని, విత్తన షాపు యజమాని, రైతు సంతకం తీసుకోవాలని ఆదేశించారు. ఈ బిల్లును పంట కాలం పూర్తయ్యే వరకు కూడా భద్రపరుచుకోవాలని, ప్రభుత్వ అనుమతి పొందిన విత్తనాలను మాత్రమే అమ్మకాలు చేయాలని, అదేవిధంగా వరి పంటకు సంబంధించి కేఎన్ఎం 1638, ఎంటుయు 1224 రకాలు అవుట్ టన్ను సరిగా రావడం లేదని, నూక శాతం ఎక్కువగా వస్తున్న కారణంగా అట్టి రకాలను తక్కువ విస్తీర్ణంలో సాగు చేసే విధంగా చూడాలని సూచించారు. పోలీస్, వ్యవసాయ శాఖలతో టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ బృందాలు ములుగు జిల్లాలోని ప్రతీ విత్తన షాపులను విధిగా తనిఖీ చేయాలని, ఆకస్మిక దాడులు నిర్వహించి ఏదైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు తమ దృష్టికి వస్తే కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సీహెచ్.మహేందర్ జీ, డీఎస్పీ ఎన్.రవీందర్, జిల్లా వ్యవసాయ అధికారి సురేష్ కుమార్, సహయ వ్యవసాయ సంచాలకులు అవినాష్ వర్మ, టాస్క్ఫోర్స్ సీఐ రమేష్, మండల వ్యవసాయ అధికారులు, ఫర్టిలైజర్ సీడ్, పెస్టిసైడ్ దుకాణ యజమానులు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment