చిన్న కాలేశ్వరం ప్రాజెక్టు పనులలో వేగం పెంచాలి
– జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశం
కాటారం, జూన్ 28, తెలంగాణ జ్యోతి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం డివిజన్లో నిర్మాణ దశలో ఉన్న చిన్న కాలేశ్వరం ప్రాజెక్టు పనులను మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 40 వేల ఎకరాలకు సాగునీరు అంద నుందన్నారు. శనివారం ఐడిఓసీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా చేపట్టిన చిన్న కాలేశ్వరం పనులలో పురోగతి లేకపోవడం శోచనీయమన్నారు. ఇరిగేషన్, రెవెన్యూ, ఫారెస్ట్ శాఖలు సమన్వయంతో పనులను వేగవంతం చేయాలని సూచించారు. ప్రధానంగా చెరువులు, కాలువల ఆధునీకరణ, పంపు హౌస్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. భూ సేకరణ సమస్యలు ఉన్న గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి గ్రామస్థులతో తీర్మానం తీసుకోవాలని, సమస్యలు లేని ప్రాంతా ల్లో వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశించారు. అదనంగా సోమవారం నుండి అధికారులు గ్రామాల్లో పర్యటించి పనుల పురోగతిని అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలన్నారు.ఈ సమా వేశంలో సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, డీఎఫ్ఓ నవీన్ రెడ్డి, ఇరిగేషన్ ఈఈ సూర్యప్రకాశ్, మెగా కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.