Sp shabarish | యోగా ప్రతి ఒక్కరి దైనందిన చర్య కావాలి

Sp shabarish | యోగా ప్రతి ఒక్కరి దైనందిన చర్య కావాలి

Sp shabarish | యోగా ప్రతి ఒక్కరి దైనందిన చర్య కావాలి

– ములుగు ఎస్పీ డాక్టర్ శబరీష్

ములుగుప్రతినిధి,జూన్21,తెలంగాణ జ్యోతి : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లా సాయుధ బలగాల కేంద్రంలో అడిషనల్ ఎస్పీ నేతృత్వంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. యోగా గురు శ్రీగురు, హరిత la సూచనలతో అధికారులు, సిబ్బంది యోగా సాధనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో మాట్లాడుతూ యోగా అనేది ప్రతి ఒక్కరి జీవితంలో దైనందిన చర్య కావాలన్నారు. విధుల్లో ఉన్న ప్రతి ఒక్కరు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా అనుసరించాలని, ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని తెలిపారు. అలాగే ప్రతి రోజూ కొంత సమయాన్ని యోగాకు కేటాయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ములుగు డీఎస్పీ రవీందర్, ఇన్‌స్పెక్టర్లు రమేష్, శంకర్, సురేష్, ఆర్ఐలు స్వామి, సంతోష్, వెంకటనారాయణ, తిరుపతి, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, మరియు పోలీసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment