ములుగు మున్సిపల్ కమిషనర్గా సంపత్ బాధ్యతల స్వీకరణ
ములుగు ప్రతినిధి, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా కేంద్రం మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తూ ఏప్రిల్ 15న రాష్ట్ర ప్రభుత్వం రాజపత్రం విడుదల చేసిన నేపథ్యంలో శుక్రవారం మున్సి పాలిటీ కమిషనర్ గా జె. సంపత్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ములుగు, బండారుపల్లి, జీవంతరావుపల్లి గ్రామ పంచాయతీలను కలుపుతూ మున్సిపాలిటీ చేయగా 2025 మే29 నుంచి అమలులోకి రానున్నట్లు అధికారికంగా వెల్లడించారు. కాగా, ములుగు మునిసిపల్ కమిషనర్ గా గ్రేడ్ 2 అధికారి జె.సంపత్ శుక్రవారం విధుల్లో చేరారు. ఈయన గతంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనరెట్ లో సానిటరీ ఇన్స్పెక్టర్గా పనిచేశారు. ప్రమోషన్ లో భాగంగా ములుగు మున్సిపాలిటీ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ దివాకర టిఎస్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అదేవిధంగా పన్నుల అధికారి వై.రామకృష్ణను ములుగు మున్సిపల్ కౌన్సిల్కు ప్రత్యేక అధికారిగా నియమించారు.