ములుగు జిల్లా రైతుల ఖాతాల్లో రూ.48 కోట్లు జమ

టాస్క్ రీజినల్ సెంటర్ లో శిక్షణ పొందిన నిరుద్యోగ యువతకు జాబ్ మేళా

ములుగు జిల్లా రైతుల ఖాతాల్లో రూ.48 కోట్లు జమ

– రైతు భరోసా పథకం ద్వారా పెట్టుబడి సాయం

ములుగు ప్రతినిధి, జూన్ 17, తెలంగాణ జ్యోతి : రైతుల భరోసా కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతు భరోసా పథకం ద్వారా ములుగు జిల్లాలో 61,666 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.48 కోట్లు నేరుగా జమ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వానాకాలం–2025 పంటల పెట్టుబడి సాయంగా ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేసినట్టు పేర్కొన్నారు. చిన్న, సన్నకారు రైతులపై పెట్టుబడి భారం తగ్గించడంతో పాటు వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందిం చేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగిస్తున్నదని కలెక్టర్ వివరించారు. జిల్లాలో మొత్తం 86,234 మంది రైతులకు రూ.103 కోట్లు విడుదల చేయాల్సి ఉన్నదని, ఇప్పటివరకు 61,666 మంది రైతుల ఖాతాల్లోకి రూ.48 కోట్లు జమ అయినట్లు తెలిపారు. ఈ నిధులను రైతు భరోసా పోర్టల్‌లో వ్యవసాయ విస్తరణ శాఖ అధికారులు నమోదు చేసిన బ్యాంకు ఖాతాల ఆధారంగా జమ చేసినట్లు పేర్కొన్నారు. మిగిలిన రైతులకు సంబంధించి ఖాతా వివరాలు నమోదు పూర్తికావలసి ఉన్నందున వారం, పది రోజుల్లో అర్హత కలిగిన ప్రతి రైతుకు రైతు భరోసా నిధులు జమ చేయబడతాయని కలెక్టర్ స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment