ఉపాధ్యాయులను నియమించాలని పి.ఓ.కు వినతిపత్రం

ఉపాధ్యాయులను నియమించాలని పి.ఓ.కు వినతిపత్రం

ఉపాధ్యాయులను నియమించాలని పి.ఓ.కు వినతిపత్రం

– విద్యా అస్థిరతపై ఆదివాసీ నవనిర్మాణ సేన ఆందోళన

వెంకటాపురం, జూన్ 30, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా లోని వాజేడు, వెంకటాపురం మండలాల్లో విద్యా అస్థిరత ఏర్పడిందని ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షుడు కొర్స నర్సింహా మూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రెండు మండలాల్లో ఉపాధ్యాయులు పని చేయడానికి నిరాకరిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ములుగు జిల్లాలో కలిపిన కారణంగా ఈ మండలాల్లో విద్యా వ్యవస్థ కుంటు పడుతోందని ఆరోపించారు. విద్యా వ్యవస్థపై రాజకీయ పార్టీలు మౌనం వహించడం బాధాకరమని పేర్కొన్నారు. మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో విద్య అభివృద్ధి చెందాలని తాము కోరుకుంటే, కొందరు ఉపాధ్యాయులు మాత్రం తమ సౌకర్యాల ను మాత్రమే చూస్తున్నారని విమర్శించారు. ఉపాధ్యాయులు వెళ్ళడానికి ఆసక్తి చూపకపోవడం వల్ల విద్య అడవిలో వెలుగు లా మారిందని వ్యాఖ్యానించారు. సోమవారం ఏటూరునాగారం ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి చిత్రా మిశ్రాకు వినతిపత్రం అందజే శారు. చిరుతపల్లి-2 ఆశ్రమ పాఠశాలలో అనేక ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, జిపిఎస్ చిరుతపల్లిలో 54 మంది విద్యార్థులకు కేవలం ఒకే ఉపాధ్యాయుడు మాత్రమే ఉన్నారని తెలియజేశారు. బోదాపురం జిపిఎస్‌లో 55 మంది విద్యార్థులకు ఒక్కరే ఉన్నారన్నారు. కలిపాక, ముత్తారం పాఠశాలల్లో రెగ్యులర్ ఉపాధ్యాయులే లేరని వివరించారు. వాజేడు మండలంలోని పెద్ద గొల్లగూడెం ఆశ్రమ పాఠశాల, జంగాలపల్లి, కాసారం పాఠశాలలు ఎకోపాధ్యాయులతోనే నడుస్తున్నాయని ప్రాజెక్ట్ అధికారికి తెలిపారు. ములుగు ప్రాంతం నుంచి ఉపాధ్యాయులు రావడానికి ఆసక్తి చూపడం లేదని అధికారులే చెబుతున్నారని విమర్శించారు. ములుగు జిల్లాలో ఈ మండలాలను కలిపిన తర్వాతే ప్రజలకు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. మారుమూల ప్రాంతాల్లో పని చేయడా నికి నిరాకరిస్తున్న ఉపాధ్యాయుల స్వార్థం వల్ల గిరిజన పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని ఆవేశపడ్డారు. ఐటిడిఏ పి.ఓ. ఉదాసీనంగా వ్యవహరించడం దురదృష్టకరమని వ్యాఖ్యా నించారు. ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే, ఎక్కడ పని చేయమ న్నా చేయాల్సిందేనని స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేయాలన్న ఆసక్తి లేకపోవడం వల్ల గతంలో జిఒ 3 ద్వారా స్థానిక గిరిజనులతోనే ఉపాధ్యాయుల నియామకం చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం జిఒ 317 వల్ల ఏజెన్సీ విద్య ధ్వంసమైందన్నారు. త్వరలోనే గిరిజన విద్య బలోపేతం కోసం ఉద్యమాన్ని ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమం లో ఏఎన్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కుంజ మహేష్, వాసం నారాయణ, గడ్డం సుమ తదితరులు పాల్గొన్నారు.

[metaslider id="19893"]

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment