వెంకటాపురం శ్రీ వెంకటేశ్వర ఆలయంలో జులై 10న రాములవారి కళ్యాణ మహోత్సవం

వెంకటాపురం శ్రీ వెంకటేశ్వర ఆలయంలో జులై 10న రాములవారి కళ్యాణ మహోత్సవం

వెంకటాపురం శ్రీ వెంకటేశ్వర ఆలయంలో జులై 10న రాములవారి కళ్యాణ మహోత్సవం

– ఏర్పాట్లను పరిశీలించిన భద్రాచలం ఆలయ ఈవో 

వెంకటాపురం,జూన్ 25, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురంలోని శ్రీ పద్మావతి అలివేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జులై 10న రాముల వారి కళ్యాణ మహోత్సవ ఘట్టం జరగనుంది. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం నుంచి, భద్రాచలం దమ్మక్క రథయాత్ర సందర్భంగా ఉత్సవమూర్తులను రథంలో  ఈ దేవస్థానానికి చేరుకున్నాక ఆలయంలో ఘనంగా శ్రీరాములవారి కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. భక్తులు పెద్ద ఎత్తున తరలి రావచ్చని అంచనా వేసిన దేవాదాయ శాఖ అధికారులు, భద్రాచలం ఆలయ ఈవో రమాదేవి ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణం, కళ్యాణ మండపం, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవో రమాదేవి మాట్లాడుతూ, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కళ్యాణ మహోత్సవాన్ని భక్తులు అందరూ కనులారా వీక్షించేందుకు అవసరమైన సదుపాయాలు కల్పించనున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం దేవస్థానం ఈవో శ్రావణ సత్యనారాయణ, జూనియర్ అసిస్టెంట్ అజయ్, భద్రాచలం సూపరిండెంట్ కత్తి శ్రీనివాస్, సి.సి. శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముందుగా భక్తులు, పురోహితులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు.

 

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment