పెండింగ్ వేతనాలు చెల్లించాలి
– ఎన్హెచ్ఎం ఏఎన్ఎం-2ల వినతి
ములుగు, తెలంగాణ జ్యోతి : ఎన్హెచ్ఎంలో పని చేస్తున్న రెండవ ఏఎన్ఎం, ఇతర ఉద్యోగులకు పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 21లోగా వేతనాలు రాకపోతే సమ్మె చేస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ములుగు జిల్లాలోని అన్ని పీహెచ్సీల్లో డాక్టర్లకు వినతిపత్రాలు సమర్పించారు. ఆయా కార్యక్రమాల్లో పి.సరోజన, కోడి సుజాత, సిలువేరు వజ్ర, సులోచన, పావని తదితరులు పాల్గొన్నారు.